29, మార్చి 2010, సోమవారం

మహాత్మా!

నాలుగేళ్ళా ఏడున్నర నెల్ల క్రితం..
ఓ జర్నలిస్తు అనబడే మిత్రుడు బుక్కేశాడు..
అది చూసి కడుపు మండిపోయిన తోటి కరడు కట్టిన జర్నలిస్తు అనుకునే సదరు శాల్తి "బుక్కులేయొద్దూ,చదవాలి" అన్నాడు.
నువ్వు చదవాలంటే ఆయన వేయాలి కదా అన్నాన్నేను.
అప్పట్నున్చి నాతో మాటలాడ్డం మానేసి భదిరులకు వార్తల టైపు సంభాసిస్తున్నాడు.
పాపం ఇప్పుడా జర్నలిస్టు హౌజ్ కు వెల్లడమే మానేసి మాన్షన్ హౌజు లోనే కాపురమ్ పెట్టాడట..
ఫ్రీడం ఆఫ్ డ్రింకింగ్ ని టెస్ట్ చేద్దామన్న ఉద్దేశంతో,
వాటర్ కలపని క్వార్టర్ సేవిస్తూ అర్థరాత్రి ఒంటరిగా తిరుగుతూ మహాత్మా గాంధీ విగ్రహానికి సెల్యూట్
చేయబోయి తుళ్ళిపడిపోతే పచ్చి మందునీళ్ళు చల్లితే తప్ప కాంప్రమైజు కావడం లేదట.

అన్నట్టు.. అతని గుండెకు చిల్లు..ఆ చిల్లు లోంచి చూస్తే కే.ఎన్.వై పతంజలి గారు దర్శనమిస్తారు.
ఓ సారి బోరున ఏడుస్తూ ఆఫీసుకొచ్చాడు...ఏంటని అడిగితే ఓ కత చూపెట్టాడు,ఆ కతని నూట యాబై ప్రింట్లు తీసి
మూడొందల మంది మిత్రులకి చదివి వినిపించే వరకు తన ఏడుపుని కంట్రోల్ చేసుకోలేక పోయాడు.
ఆ కత "సీతమ్మ లోగిట్లో...."..రచయిత కాకర్లపూడి నారసింహ యోగ పతంజలి.
ఇది చిల్లిగవ్వకు రెండో సైడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి