14, ఆగస్టు 2010, శనివారం

జై భొలో సతంత్రభారత్ కీ.! జై !!

mrityunjay

మా ఇస్కూలు మొత్తం పోరగాల్లతో పాటు మా బ్యాచి పిలగాండ్లు పండరినాథ్,కిషోర్ గాడు,సుదర్సన్ గాడు,ఆర్.ఎంకటి గాడు,పి.రవిందర్,దేవకినందన్..ఇద్దరేసి పోరగాల్లం లెక్కన పంద్రాగష్టు రోజు జంటగా మా ఇస్కూల్ నుంచి చెర్వు కట్ట దగ్గర వినోభా మందిరం దగ్గరికెళ్ళి రిటన్ తిరిగి పాతసంఘం,గాంధి బొమ్మ పక్కనుంచి జై భొలో సతంత్రభారత్ కీ.! జై !! అంటూ మార్కండెస్వర స్వామి గుడి ముంగటనుంచి పోచంపల్లి ప్రతి సందూ తిరుగుతూ మా ఇంటి ముందునుంచి మల్లీ ఇస్కూలు కెల్లి జనగనమన పాడేసి ఓ చేత్తో పిప్పర్మెంట్లు,ఇంగో చేత్తో బిస్కత్తులు పట్టుకొని ఇంటికెలుతూ..జై భొలో సతంత్రభారత్ కీ.! జై !!

4 కామెంట్‌లు: