5, జూన్ 2010, శనివారం

చెట్టు ఎండితే నువ్వూ ఎండినట్టేనోయ్ !

దినపత్రిక కోసం గీకే బొమ్మకు,టీ.వీ ఛానలు కోసం గీకితే గోకే బొమ్మకు చాలా దగ్గర సంబంధం ఉంది..ఒకరకంగా బొత్తిగా సంబంధం లేదు...
పరపంచ పర్యావరన దినం కోసం శ్యామ్ మోగనుగారు పోన్జేసి "మ్రుత్యుంజయ్ గారూ !మరే మీరు కార్టూన్లు పంపండి స్సార్..లుంబినీ పార్కులో ఎజ్జిబిషను పెట్టి ఎగసెక్కాలాడదాం స్సార్.."అంటూ బండ మర్యాదలాడాడు..సరేలే అన్జెప్పి ఓ మూన్నాలుగు బరబరా గీకి లుంబినీ పార్కులో సూపర్ ఇగో ఎజ్జిబిషను ప్రదర్శించి పక్కనే వున్న ఉస్సేను సాగర్లో దూకి సద్దాం..లేదా పక్క కలాకారులను నూకేసి బుద్ధభగమంతుడికి సెల్యూట్ సేద్దామని గీకిన కార్టూన్లో ఒహటి ఆనిమేసనుకు సవులబ్యంగా తోచీతోచగానే ఓ యానివేషం కట్టా........[లేటెస్టు ఇన్పర్మేసను ఏంటంటే వెన్యూ మారిందంటా.]
చెట్టు ఎండితే నువ్వూ ఎండినట్టేనోయ్ ! అని మనమిక్కడ గమనించాల్సిన ఘట్టం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి